Monday, June 10, 2024

Hyderabad Metro టైమింగ్స్‌ పొడిగింపు.. వివ‌రాలివే !

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. రైలు నడిచే వేళలను పొడిగించాలనే డిమాండ్ లు ఎప్పటి నుంచో ఉన్నందున ఆ దిశగా హెచ్ఎంఆర్ఎల్ (హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్) ప్రయత్నాలు చేస్తోంది. ట్రయల్ లో భాగంగా ఇప్పటికి వారానికి ఒక రోజుపాటు.. చివరి ట్రైన్ నడిచే వేళలను పొడిగించారు. ఈ సంద‌ర్భంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వివరించారు.

ఇక‌ ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్లు మొదలు అవుతాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ దిశగా అధికారులు ట్రయల్‌ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మెట్రో రైళ్లకు ఆ సమయాల్లో ఉన్న ఆదరణ, ప్రయాణికుల రద్దీ, ట్రాక్‌ నిర్వహణ, కోచ్‌ల మెయింటెనెన్స్ వంటి ఇతర విషయాలను కూడా పరిగణనలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇప్పటికైతే శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటలకు టెర్మినల్ స్టేషన్ లో చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement