Wednesday, May 15, 2024

కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

గౌహతిలోని కామాఖ్య అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. శక్తిపీఠం కామాఖ్యలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ ప్రొఫెసర్‌ జగదీశ్‌ ముఖి, సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు ఇతరులు రాష్ట్రపతితో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అస్సాంతో పాటు ఈశాన్య భారతంలో మౌళిక సదుపాయాలు పెరిగాయని, దీని వల్ల ప్రజల జీవితం ఈజీ అయ్యిందన్నారు. యావత్‌ భారత దేశ అభివృద్ధి కోసం అస్సాం అభివృద్ధి కీలకమని ముర్ము అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement