Sunday, May 26, 2024

కేంద్రంతో బ్లేమ్ గేమ్ ఆడటం మంచిది కాదు.. గవర్నర్ తమిళిసై

కేంద్రంతో బ్లేమ్ గేమ్ ఆడటం మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా అన్నారు. ప్రతి సమస్యపై సీఎంకు లేఖలు రాస్తూనే ఉన్నానన్నారు. నిద్రపోతున్నట్లు నటించేవాళ్లను ఏం చేయలేమన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడలేదన్నారు. తనకు గౌరవం ఇవ్వకున్నా పనిచేస్తూనే ఉంటానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement