Thursday, May 2, 2024

దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య.. గత వారం రోజులతో పోలిస్తే భారీగా పెరిగింది. దేశంలో కొత్తగా 37,593 మంది వైరస్ బారిన పడగా.. 648 మంది మరణించారు. అదే సమయంలో 34,169 మంది కరోనా​ను జయించారు. ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,25,12,366లకు చేరింది. ఇందులో 3,17,54,281 వైరస్ నుంచి కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 4,35,758 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే 61,90,930 కొవిడ్​ టీకా డోసులు అందించారు. ఇప్పటివరకు 59,55,04,593 టీకా డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండిః కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణేకు బెయిల్

Advertisement

తాజా వార్తలు

Advertisement