Monday, April 29, 2024

ఆఫ్ఘన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన 16 మందికి కరోనా..

ఆఫ్ఘనిస్థాన్‌ ను తాలిబన్లు ఆక్రమించడంతో అక్కడ ఉన్న భారతీయుల్ని మన దేశానికి తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే మంగళవారం 78 మంది భారత్‌కు వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా మొత్తం 78 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఇప్పటివరకు 626 మంది భారత్‌కు వచ్చారని కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి తెలిపారు. అందులో 228 మంది భారతీయులు ఉన్నారని, మరో 77 మంది ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సిక్కులు ఉన్నారని వెల్లడించారు. మిగిలినివారిలో విదేశీయులతోపాటు భారత ఎంబసీకి చెందినవారు ఉన్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి: ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement