Wednesday, May 8, 2024

India Corona: దేశంలో కరోనా ఖతం.. 24 గంటల్లో 1270 కేసులు

దేశంలో కరోనా మహమ్మారి భారీగా తగ్గింది. రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1270 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,20,723 కు చేరింది.

దేశంలో తాజాగా 31 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,21,035 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1567 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,83,829 కు చేరింది. ఇక దేశంలో ప్రస్తుతం15,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి.దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.16 శాతంగా ఉంది.  ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,83,26,35,673 కరోనా వ్యాక్సిన్లు  పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement