Saturday, May 4, 2024

Flash: రైలు కిందపడి మూడేళ్ల కూతురుతో తండ్రి ఆత్మహత్య

తన మూడేళ్ల కూతురు తో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు నగరంలో సోమవారం వెలుగు చూసింది. నగరంలోని ధర్మపేట చెందిన మధు అనే వ్యక్తి ఆదివారం అర్ధరాత్రి భార్యతో గొడవపడి తన మూడేళ్ల కూతురితో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంటి నుంచి వెళ్లిన మధు ఆ తర్వాత కూతురితో పాటు ధర్మపేట వద్ద రైల్వే పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మధు ఎద్దుల బండి పై తుంగభద్ర నదిలో ఇసుక తోడి విక్రయించగా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత రాత్రి భార్యతో గొడవపడిన మదు బయటకు వచ్చి కూతురితో పాటు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికులను కలచివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement