Saturday, May 18, 2024

Puri: నా ద‌గ్గ‌ర డబ్బుల్లేవ్… పార్టీ కూడా ఇవ్వ‌నంటుంది… సుచిత్ర

మీ టికెట్ కో న‌మ‌స్కారం..
పోటీ నుంచి విర‌మించుకుంటున్నా..
కాంగ్రెస్ పార్టీ ఝ‌ల‌క్ ఇచ్చిన..
పూరి లోక్ స‌భ అభ్య‌ర్థి సుచిత్ర..

పూరి – ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది నేతలు పార్టీని వీడగా.. తాజాగా ఒడిశాలోని పూరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి సుచిత్ర మొహంతీ తన టికెట్‌ను పార్టీకి వెనక్కి ఇచ్చేశారు. ప్రచారానికి అవసరమైన నిధులు తన వద్ద లేవని, పార్టీ కూడా తగినన్ని నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఖర్చులు తగ్గించుకున్నప్పటికీ ప్రచారం ప్రభావవంతంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘పార్టీ నుంచి నాకు ప్రచారం కోసం నిధులు అందలేదు. అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. డబ్బుల విషయంలో బీజేపీ, బీజేడీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుల్లేకుండా బరిలోకి దిగడం కష్టం. అందుకనే పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను’’ అని సుచిత్ర తెలిపారు.

- Advertisement -

2014 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థి పినాకి మిశ్రా చేతిలో సుచిత్ర ఓటమి పాలయ్యారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు సుచిత్ర లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement