Saturday, April 27, 2024

Breaking: బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పాదయాత్ర చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాదయాత్ర నిర్మల్ జిల్లాలోని భైంసా నుంచి ప్రారంభం కానుంది. కాగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానంలో బీజేపీ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించనున్నారు.

అయితే హైకోర్టు ఈ పాదయాత్రకు షరతులు విధించింది. 500మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని తెలిపింది. మూడు వేల మంది సభతో జరుపుకోవాలని, సభ్య మధ్యాహ్నం 3గంటల నుండి 5గంటల లోపే జరుపుకోవాలని తెలిపింది. ఇతర మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని హైకోర్టు సూచించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement