Thursday, April 25, 2024

అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి…

ఉన్న‌త విద్య కోసం తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన శివదత్త, నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్ సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నారు. వీరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆపై అక్కడే ఉన్న సరస్సులో ఈత కొట్టేందుకు దిగారు. చలి బాగా ఎక్కువగా ఉండడంతో మిగతా వారు బయటకు రాగా.. శివదత్త, ఉత్తేజ్ మాత్రం సరస్సులో గల్లంతయ్యారు. ఒడ్డుకు చేరిన స్నేహితుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు సరస్సులో నుంచి శివదత్త మృతదేహాన్ని వెలికితీశారు. ఉత్తేజ్ కోసం చాలాసేపు గాలించినా.. ఆదివారం రాత్రికి కానీ మృతదేహం లభించలేదు. శివదత్త, ఉత్తేజ్ ల మరణ వార్త తెలిసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement