Wednesday, March 27, 2024

Drugs: ముంబై ఎయిర్‌పోర్టులో రూ.కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం…

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ భారీగా సాగుతోంది. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవ‌డం అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లో సైతం డ్రగ్స్ ల‌భిస్తుందంటే ఈ దంగా ఏమేర సాగుతోందో అర్ధం చేసుకోవ‌చ్చు. తాజాగా ముంబై విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు 8 కిలోలు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వీరికి డ్ర‌గ్స్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది, సూత్ర‌దారులు ఎవ‌రు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement