Friday, April 26, 2024

రామ్ చ‌ర‌ణ్ తో శంక‌ర్ సినిమా – ఒక్క సాంగ్ కోస‌మే రూ. 25కోట్లు

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తీసే చిత్రాల గురించి అంద‌రికీ తెలిసిందే. భారీ బ‌డ్జెట్, భారీ సెట్స్ తో అద‌ర‌గొడుతుంటాడు. కాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు శంక‌ర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షడ్యూల్ లను కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. చరణ్- కియారా కలిసి గతంలో వినయ విధేయ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీనిను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాగా ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నారని ఇందులో చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడట‌.

మరికొంతమంది చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తాజాగా ఫిలిం సర్కిల్స్ లో విహారం చేస్తుంది. మాములుగా శంకర్ సినిమాలో పాటలకు గ్రాండియర్ లుక్ ఉంటుంది. అద్భుతమైన లొకేషన్స్ తో పాటు ఓ కాన్సెప్ట్ తో పాటలను తెరకెక్కిస్తారు శంకర్. ఇప్పుడు చరణ్ సినిమాకోసం కూడా అలాంటి ఓ పాటను తెరకెక్కించాలని చూస్తున్నారట. ఈ పాట కోసం ఏకంగా శంకర్ 25 కోట్లు ఖర్చు చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పాటకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపుతున్నారట. అందుకోసమే అంత ఖర్చు అని అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement