Thursday, March 28, 2024

గ్రంధాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం – హాజరైన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

ఖమ్మం ఫ జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కోత్తూరు ఉమామహేశ్వర రావు ప్రమాణ స్వీకారం , పదవీ బాధ్యతల కార్యక్రమానికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి హాజరైయ్యారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కోత్తూరు ఉమామహేశ్వర రావు ని అభినందించారు. అనంతరం VVC ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి పాల్గొని జిల్లా గ్రంధాలయ చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా పని చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ నేత ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే రామ్ నాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, బాలసాని లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోత్తూరు ఉమామహేశ్వర రావు కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేష్, దోసపాటి వెంకటేశ్వరరావు, మెళ్లచెర్వు వెంకటేశ్వర రావు, గెళ్ళ జగన్మోహనరావు, కొప్పు నరేష్, చిన్ని కృష్ణా రావు, కొత్తూరు ప్రభాకర్ రావు, పులిపాటి ప్రసాద్, గోళ్ల రాధాకృష్ణ , బెల్లం వేణు, ఇంటూరి శేఖర్ మరియు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు , నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement