Wednesday, May 8, 2024

ఎగ్జామ్ రాసిన త‌ర్వాతే పెళ్ళి ..

ఓ ప‌క్క పెళ్లి..మ‌రో ప‌క్క ఎగ్జామ్..అయితే ఆ పెళ్లి కూతురు ఏకంగా పెళ్ళి కొడుకుని వెంట‌బెట్టుకొని ప‌రీక్ష‌కి హాజ‌ర‌వ‌డం విశేషం. ఈ సంఘ‌ట‌న గుజ‌రాత్ లోని రాజ్కోట్ లో చోటు చేసుకుంది. రాజ్కోట్ కి చెందిన శివాంగి పెళ్లి కంటే కూడా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకి ప్రాధాన్యత ఇవ్వడం అభినందించాల్సిన విషయం. పరీక్ష రాస్తున్న విద్యార్థులు పెళ్ళి కూతురిని చూసి ఆశ్చర్యపోయారు. పరీక్ష రాసిన తర్వాత వధూవరులు పెళ్లి మండపానికి వెళ్లారు. పరీక్ష తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి తేదీ నిర్ణయించినప్పుడు పరీక్ష తేదీ ఇంకా రాలేదని తన పరీక్షలు ఎంతో ముఖ్యమని తన భర్తకి కూడా ఆమె చెప్పింది. ఇరు కుటుంబాలు కూడా తీవ్ర చర్చ జరిపి ఆఖరికి ఆమె పరీక్షకి విలువ ఇచ్చారు. ఈ పోస్టు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి చదువు ఎంత ముఖ్యమో నేర్చుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement