Saturday, April 27, 2024

సర్కారురి పాట సినిమాకు వారం రోజులపాటు ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహేష్‌ బాబు కథా నాయకుడిగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి వారం రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా అదనపు షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభు త్వం గతంలో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సర్కారు వారి పాట చిత్ర టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టిఫ్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో అదనంగా రూ.50 పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement