స్టార్ కపుల్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఉపాసనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంట అనోన్యంగా ..ఆదర్శంగా నిలిచారు. కాగా వీరి పెళ్లి జరిగి పదేళ్లు పూర్తయింది. అయితే వీరు పిల్లలకోసం ఇంకా ప్లాన్ చేసుకోనట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై క్లారిటీ తీసుకోవడానికి రీసెంట్ గా ఉపాసన సద్గురు దగ్గరికి వెళ్లి… పిల్లలు కనడంపై ఉద్దేశాన్ని చెప్పమని అడగగా.. సద్గురు పిల్లలను కనవలసిన అవసరం ఏముంది.. ఒకవేళ ఆడ పులి అయితే పులి పిల్లలకు జన్మనివ్వమని చెప్పేవాడిని.. ఎందుకంటే అంతరించిపోతున్న పులిజాతిని కాపాడాలంటే పులి పిల్లలకు జన్మనివ్వడం మంచిది. ఇక ఎక్కడ చూసినా పుట్టలు పుట్టలుగా మానవజాతి పెరిగిపోతున్న నేపథ్యంలో సమాజానికి మనం చేసే మేలు ఒకటే పిల్లలు అనే ఆలోచనకు దూరంగా ఉండడమే అని చెప్పారు. కానీ ఈ విషయంపై ఉపాసన స్పందిస్తూ మా అత్త , అమ్మ నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి.. అప్పుడు సమాధానం చెప్పండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా ఈ విషయంపై స్పందించారు ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ ..ఈ విషయంలో ఉపాసనపై ఫైర్ అయ్యారు. గీత కృష్ణ మాట్లాడుతూ పేదవారైనా, గొప్పింటి వారైనా తమ వంశంలో వంశాంకురాలు ఉండాలని ఆలోచించడంలో తప్పులేదు కదా.. ఇక ఎవరైనా సరే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసిన తర్వాత వారసుల కోసం ఎదురు చూస్తారు.. చిరంజీవి, సురేఖ తమ వారసుల కోసం అడగడంలో తప్పులేదు కదా.. నీవు ఈ విషయాన్ని నాలుగు గోడల మధ్యే చర్చించాల్సింది పోయి నలుగురిలో అతడి ముందు నోరు విప్పాల్సిన అవసరం ఏముంది.. అతడేవరు నిన్ను పిల్లలను కనవద్దు అని చెప్పడానికి.. కుటుంబ పరువును మొత్తం ఉపాసన తీస్తోంది అంటూ ఆమె పై ఫైర్ అయ్యాడు. మరి ఈ విషయంపై ఉపాసన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.