Saturday, May 25, 2024

తాచుపాముతో స‌య్యాట‌, కాటువేసినా ప‌ట్టించుకోలే.. నిర్లక్ష్యంతో ప్రాణమే పోగొట్టుకున్నాడు.. (వీడియో)

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెల‌కొంది. మణుగూరు పట్టణంలో పాము కాటుతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ షరీఫ్ నాగరాజు చ‌నిపోయాడు. సమితి సింగారం ప్రాంతంలో బావిలో తాచు పాముని పట్టిన షరీఫ్ నాగరాజు.. గంట పాటు ఆ పా తాచు పాముతో ఆట‌లు ఆడాడు. అదే సమయంలో అత‌ని చేతిపై తాచు కాటువేసింది.

దీంతో అత‌ని స్నేహితులు ఆస్పత్రికి వెళ్లాల‌ని చెప్పినా విన‌లేదు. ఆ త‌ర్వాత పాముని అడవిలో వదిలి సురక్ష బస్టాండ్ వద్ద పడిపోవడంతో అక్క‌డున్న వారు ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే అత‌ను పాము కాటుతో విషమించి చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు.

వీడియో కోసం www.prabhanews.com లో చూడండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement