Wednesday, May 8, 2024

Nepal : కొండచ‌రియ‌లు విరిగిప‌డి .. ఐదుగురు మృతి

భారీ వ‌ర్షాల కార‌ణంగా కొండచ‌రియ‌లు విరిగి ప‌డి ఐదుగురు మృతిచెంద‌గా.. మ‌రో 28మంది గ‌ల్లంతైన విషాద ఘ‌ట‌న నేపాల్ లో చోటుచేసుకుంది. నేపాల్ లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండ‌డంతో ఆ దేశంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వరద సంబంధిత మరణాలపై నేపాల్‌ ప్రధాని పుష్ప కుమార్‌ దహల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ప్రధాని పుష్ప కుమార్‌ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement