Saturday, April 27, 2024

కారు, రెండు బైక్ లు ఢీ : ఐదుగురు మృతి

ఓ ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఐదుగురు మృతిచెంద‌గా, మ‌రో ఐదుగురు గాయ‌ప‌డిన విషాద ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పూణె – అహ్మద్ నగర్ జాతీయ రహదారిపై ఈరోజు కారు, రెండు బైక్ లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేగంగా వస్తున్న కారును, బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement