హుజురాబాద్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఈటల కుటుంబాన్ని టీఆర్ఎస్ బ్లేమ్ చేస్తున్న వేళ.. ఈటల అనూహ్యంగా చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ఈటల కారణంగానే హుజూరాబాద్లో దళిత బంధు పథకం అమలు అవుతోందని.. రెండు, మూడు రోజులుగా ఆయనకు పాలాభిషేకాలు చేస్తున్నారు కొన్ని చోట్ల దళితులు. ఈక్రమంలో పాదయాత్రలో భాగంగా విలాస్ సాగర్కు వచ్చిన ఈటలకు.. ఊహించని విధంగా సన్మానం ఏర్పాటు చేశారు. ఆయన కాళ్లను పాలతో కడిగేందుకు సిద్ధమయ్యారు.అయితే వద్దని వారించినా వారు వినకపోవడంతో.. ముందుగా వాళ్ల కాళ్లను మొక్కి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత తన కాళ్లు కడగటానికి అవకాశం ఇచ్చారు ఈటల.
ఈటల చర్యకు అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. ఇది కదా దళితుల మీద నిజమైన ప్రేమ అంటూ ఈటలకు మద్దతుగా నినాదాలు చేశారు. దళితులపై ప్రేమ ఉందని చెప్తున్న టీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఈ పనిచేయగలరా అని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..