Saturday, April 27, 2024

సీపీఐ నారాయ‌ణ కాలికి గాయం..వైసీపీ నేత గురుమూర్తి వైద్యం..

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించేందుకు చిత్తూరు వెళ్ళారు. కాగా రాయ‌ల చెరువు లీకేజి వార్త‌ల నేప‌థ్యంలో ప‌రిశీల‌న‌కు వెళ్ళారు.. కొండ దిగువకు వస్తుండగా కాలు బెణికింది. బాగా వాపు రావడంతో కనీసం అడుగు తీసి అడుగు వేయలేకపోయారు.ఇంతలో తిరుపతి ఎంపీ, వైసీపీ నేత డాక్టర్ గురుమూర్తి అక్కడికి వచ్చి గాయంతో బాధపడుతున్న నారాయణను గమనించారు. వెంటనే స్పందించిన ఆయన నారాయణ కాలికి చికిత్స చేశారు. కాలుకు కట్టుకట్టి తాత్కాలిక ఉపశమనం కలిగించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వృత్తి పట్ల అంకితభావం, మంచి మనసు చూపారంటూ వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement