Thursday, May 2, 2024

కరోనా ఎఫెక్ట్.. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా.. తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్టులో కరోనా కలకలం చెలరేగింది. విమానాశ్రయంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో చైనా నుంచి వచ్చిన ఇద్దరు తల్లీకూతుళ్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఇద్దరి శాంపిల్స్ ను వైద్యాధికారులు ల్యాబ్ కు పంపారని సమాచారం. మరోవైపు మధురై ఎయిర్ పోర్టులో ప్రయాణికులందరికీ సిబ్బంది కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. వీరిలో 20 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. కరోనా కేసులు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement