Saturday, April 27, 2024

పాదాచారులపై దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

పాదా చారులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.ఈ సంఘటన చైనాలోని గాంగ్‌జూలో చోటు చేసుకుంది. కాగా ఈ ఘ‌ట‌న‌లో 13 మంది గాయ‌ప‌డ్డారు. దీనిపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కావాల‌నే ఆ వ్య‌క్తి ప్ర‌జ‌ల‌పైకి కారును న‌డిపిన‌ట్లు ఆరోపించారు. పాదాచారుల్ని ఢీకొట్టిన త‌ర్వాత కారు నుంచి దిగిన ఆ వ్య‌క్తి బ్యాంక్ నోట్ల‌ను విసిరేస్తూ క‌నిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్ లో పోస్టు చేశారు. కారుతో బీభ‌త్సం సృష్టించిన 22 ఏళ్ల వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేసి విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement