Wednesday, May 8, 2024

Breaking: ప్రేమ పేరుతో వేధింపులు.. దారుణహత్య

ప్రేమ పేరుతో వేధిస్తున్న వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఓ యువతిని ఓ వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఆ యువతి కుటుంబం బండరాయితో కొట్టి చంపింది. మహేష్ అనే వ్యక్తి పెళ్లైన యువతికి అసభ్య మెసేజ్ లు పంపుతూ వేధించడంతో పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదు చేశారు.

వేధింపుల ఘటనపై యువతి పీఎస్ లో ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆగ్రహంతో మహేష్ ను ఆ యువతి కుటుంబం కొట్టి చంపింది. యువకుడి తలను యువతి రాయితో ఛిద్రం చేసింది. తన తల్లి, సోదరుడితో కలిసి వేధిస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ హత్య ఘటన మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ఇందారంలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement