Saturday, April 27, 2024

పాము కాటు వేసిందని.. కోపంతో పాముని కొరికి చంపేసిన బాలుడు

ఎనిమిదేళ్ల బాలుడు దీపక్ తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు..అయితే ఉన్నట్టుండి ఓ నాగుపాము ఆ బాలుడి చేతికి చుట్టుకుంది. దాన్ని విడిపించేందుకు దీపక్ చేయిని విదిలించాడు. దాంతో పాము కాటేసింది. ఆ తర్వాత కూడా అది ఆ చిన్నారి చేయిని విడిచి పెట్టడం లేదు. దీంతో అతడు కోపంతో చేయిని నోటి దగ్గరకు తీసుకుని పామును రెండు సార్లు కొరికేశాడు. ఈ దెబ్బకు నాగుపాము చనిపోయింది. ఇదే విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తమ కుమారుడిని తరలించారు.వైద్యులు యాంటీ స్నేక్ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చి, పరిశీలనలో ఉంచారు. కాకపోతే చిన్నారికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. సదరు కోబ్రా చిన్నారిని కాటు అయితే వేసింది కానీ, విషాన్ని విడుదల చేయలేదు. దీన్ని డ్రై బైట్ గా వైద్యులు తేల్చారు. ఒక రోజు పరిశీలనలో ఉంచిన తర్వాత చిన్నారిని ఇంటికి పంపించేశారు.ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ లోని జస్పూర్ జిల్లాలో ఓ గ్రామంలో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement