Friday, May 3, 2024

ఢిల్లీ లిక్కర్​ కేసు.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీస్​ సిసోడియా పీఏ ఇంట్లో ఈడీ సోదాలు

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) ఇంటిపై శనివారం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈ విషయాన్ని సిసోడియా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ‘‘వారు తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నా ఇంటిపై దాడి చేశారు. నా బ్యాంక్ లాకర్లను పరిశీలించారు. మా గ్రామానికి వచ్చి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. కానీ, నాకు వ్యతిరేకంగా ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు. ఈ రోజు నా పీఏ ఇంటిపై ఈడీ రైడ్ చేస్తోంది. ఏం లభించలేదు. అయినా.. అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు”అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

బీజేపీకి గుజరాత్​ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఎక్కువైంది అని ఆప్ నేత ట్వీట్‌లో బీజేపీపై విరుచుకుపడ్డారు. మనీష్ సిసోడియా వాదనకు బీజేపీ నేత గౌరవ్ భాటియా కౌంటర్ ఇస్తూ.. అతను (సిసోడియా) నిందితులలో నంబర్ వన్ అని, అలాంటి కేసును దర్యాప్తు సంస్థలు ఎందుకు పరిశీలించకూడదో చెప్పాలి అన్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ సోదాలను వేగవంతం చేసింది. మనీష్ సిసోడియా సన్నిహితులపై కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement