Thursday, March 28, 2024

రాజేంద్రనగర్ లో బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. హైదర్‌గూడ సమీపంలో పీవీ ఎక్స్ ప్రెస్ వే 159 పిల్లర్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి శంషాబాద్‌కు చెందిన పానుగంటి నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement