Saturday, April 27, 2024

Breaking: అరెస్టులు షురూ.. పోలీసుల అదుపులో వామపక్షాల, కార్మిక సంఘాల నాయకులు

ప్రధాని మోదీ తెలంగాణ‌ పర్యటనను అడ్డుకునేందుకు పిలుపునివ్వడంతో వామపక్షాల నాయకులతోపాటు కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ప్రధాని మోడీ రామగుండం పర్యటన నేపథ్యంలో సిపిఐ, సిపిఎం నాయకులతోపాటు కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం రాత్రి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వామపక్షాలతో పాటు కాంగ్రెస్, టిఆర్ఎస్వి, ఎస్ఎఫ్ఐ,డిఎఫ్ఐ, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి, సిఐటియు, ఎమ్మార్పీఎస్, పిడి ఎస్, బి ఎం ఎస్, ఆర్ ఎఫ్ సి ఎల్ మజ్దూర్ యూనియన్, బొగ్గు గని కార్మిక సంఘం, పి వై ఎల్, పిడి ఎస్ యు నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement