Saturday, May 4, 2024

TS | తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. మంత్రి కేటీఆర్‌తో లాయిడ్స్‌ గ్రూప్ భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలో పెట్టు-బడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తరలివస్తున్నాయి… ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌ నుంచి ప్రారంభించాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ- రామారావు తెలిపారు. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్‌ సంస్థ ”లాయిడ్స్‌” గ్రూప్‌ రాష్ట్రంలో పెట్టు-బడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బుధవారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ‘లాయిడ్స్‌’ గ్రూప్‌ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. పెట్టుబడుల అంశంపై చర్చించారు.

గత నెల మంత్రి కేటీ-ఆర్‌ యూకే పర్యటనలో భాగంగా జరిగిన సమావేశం తర్వాత ఐదు వారాల్లోనే తెలంగాణలో పెట్టు-బడి పెట్టేందుకు లాయిడ్స్‌ నిర్ణయం తీసుకుంది. వ్యాపార అనుకూలతలు, అత్యంత్య నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటు-లో ఉండటంతోనే హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని లాయిడ్స్‌ బ్యాంక్‌ తెలిపింది. ఆర్థిక సేవలు అందించడంలో యూకేలో టాప్‌ పొజిషన్‌లో ఉన్న లాయిడ్స్‌ బ్యాంకుకు దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు-కు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు- లాయిడ్స్‌ తెలిపింది.

హైదరాబాద్‌లో లాయిడ్స్‌ బ్యాంక్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు-పై మంత్రి కేటీ-ఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. లాయిడ్స్‌ బ్యాంక్‌ గ్రూప్‌కు సాదరస్వాగతం పలికారు. యూకేలో కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బృందంతో గత నెల సమావేశం అయిన అనతికాలంలోనే తెలంగాణలో పెట్టు-బడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషాన్ని ఇస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, -టె-క్నాలజీ, ఇన్నోవేషన్‌ రంగంలో ఉన్న ఈకో సిస్టంతో -టె-క్నాలజీ సెంటర్‌ను ప్రారంభించేందుకు లాయిడ్స్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీ-ఆర్‌ తెలిపారు. సుమారు 600 మందిని తొలి ఆరు నెలల్లో ఉద్యోగాల్లోకి తీసుకొనున్నదని, తర్వాత ఈ సంఖ్యను పెంచుతుందని తెలిపారు.

- Advertisement -

హైదరాబాద్‌లోని బిఎఫ్‌ఎస్‌ఐ ఈకో సిస్టంకు లాయిడ్స్‌ బ్యాంక్‌ -టె-క్నాలజీ సెంటర్‌ మరింత బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. -టె-క్నాలజీ, ఇన్నోవేషన్‌ రంగంలో గొప్పగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో -టె-క్నాలజీ సెంటర్‌ ఏర్పాటు- చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులకు దీర్ఘకాలం సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని లాయిడ్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాన్‌ వాన్‌ కేమెనడే తెలిపారు. -టె-క్నాలజీ సెంటర్‌ ఏర్పాటు-తో తమ సంస్థకు మరిన్ని అవకాశాలు కలుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. హైదరాబాద్‌లో ఉన్న అద్భుత మానవ వనరులు, వారి నైపుణ్యం, ఇన్నోవేషన్‌ రంగంలో ఉన్న వారి ప్రతిభ తమ సంస్థ పురోగతికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటు-ందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement