Monday, April 29, 2024

Warning | షిరిడీ సంస్థాన్‌పై త‌ప్పుడు వార్త‌ల ప్ర‌చారం.. షేర్ చేసిన వ్య‌క్తిపై క్రిమిన‌ల్ కేసు

షిరిడీ, (ప్రభ న్యూస్): షిరిడీ సాయిబాబాని కించపరిచేలా, సంస్థాన్​పై తప్పుడు వార్తలు రాయ‌డం, సోష‌ల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్ట‌డం, లేదా వాటిన షేర్ చేసేవారిని వదిలిపెట్టబోమని సీరియస్​గా హెచ్చరించారు సంస్థాన్​ చీఫ్​ ఎగ్జిక్యూటీవ్​ ఆఫీసర్​ (సీఈవో) పి. శివశంకర్​. ఇవ్వాల (బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయిబాబా సంస్థాన్ పరువుకు భంగం కలిగించే పోస్ట్ షేర్ చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఇక మీదట ఎవ‌రైనా కానీ సాయిబాబా సంస్థాన్‌పై ఎలాంటి విష‌పు రాత‌లు, పోస్టుల‌ను ప్ర‌చారం చేసినా క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌న్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ లు, తప్పుడు వార్తలను న‌మ్మొద్ద‌ని, వాటిని షేర్ చేయొద్ద‌ని సాయి భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement