Sunday, May 12, 2024

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య – 7గంట‌లు న‌డిచిన 80 ఏళ్ల బామ్మ

రష్యా .. ఉక్రెయిన్ మధ్య వార్ మొదలై 13 రోజులైంది. నివాస ప్రాంతాల్లో రష్యా సైన్యం దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి నిరంతరం బాంబు దాడులు జరుగుతున్నాయి. చాలా మంది ఉక్రెయిన్ పౌరులు తమ దేశ భద్రత కోసం తుపాకీలను పట్టుకుని యుద్ధ రంగంలోకి దిగారు. దేశం కోసం చనిపోతున్న భావన వృద్ధులలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఐక్యరాజ్యసమితి ప్రకారం .. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్ నుండి అర మిలియన్ కంటే ఎక్కువ మంది వ‌ల‌స‌ వెళ్లిపోయారు. అదే జాబితాలో చోమోనిన్ గ్రామానికి చెందిన పిరోస్కా బక్సా అనే 80 ఏళ్ల బామ్మ కూడా ఉంది. ఆమె పోరాటాన్ని నివారించడానికి ఏడు గంటల పాటు నడిచింది. 1942లో జన్మించిన పిరోస్కా బక్సా తన కుమార్తె .. 14 ఏళ్ల మనవరాలితో కలిసి హంగేరియన్ సరిహద్దును దాటింది. మొద‌టిలో ఆమె తన దేశం, తన ఇంటిని విడిచిపెట్టడానికి అంగీకరించలేదు, కానీ కుటుంబ భద్రతను చూసి, ఆమె అంగీకరించింది.ఈ సంద‌ర్భంగా పిరోస్కా బక్సా మాట్లాడుతూ.. నేను దేశం విడిచి వెళ్లకూడదని భావించాను. చివరికి, మీరు మీ ఇంటిని, ప్రతిదీ వదిలివేయవలసి వస్తుంది, ఇది చాలా బాధాకరమైన అనుభూతని తెలిపింది..నా కుమార్తె పెంపుడు కుక్కని విడిచిపెట్టవలసి వచ్చింది. కుక్కుతో నివసించడానికి ఎవరూ లేరు. ప్రాణాలను కాపాడుకునేందుకు అందరూ పారిపోతున్నారని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement