Monday, May 13, 2024

Breaking : గుర్రంపై అసెంబ్లీకి మ‌హిళా ఎమ్మెల్యే

ఓ మ‌హిళా ఎమ్మెల్యే గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వెళ్లింది. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మ‌హిళా ఎమ్మెల్యే అంబా ప్ర‌సాద్ ఈరోజు గుర్రం స్వారీ చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం నేప‌థ్యంలో ఆమె గుర్రం స్వారీ చేప‌ట్టారు. ప్ర‌తి రంగంలోనూ మ‌హిళ‌లు రాణిస్తున్నార‌ని, పేరెంట్స్ త‌మ కూతుళ్ల‌కు మంచి విద్య‌ను అందించాల‌ని ఆమె తెలిపారు. ప్ర‌తి మ‌హిళ‌లోనూ దుర్గా, జాన్సీరాణీ ఉంద‌న్నారు. ధైర్యంతో మ‌హిళ‌లు ప్ర‌తి స‌వాల్‌ను ఎదుర్కోవాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement