Tuesday, July 23, 2024

TS: బీజేపీ ఎంపీ అభ్య‌ర్ధి మాధ‌వీ ల‌త‌పై కేసు నమోదు..

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమోదయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు.. మాధవీలత పోలింగ్ బూత్‌లోకి వచ్చి బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేశారు.

హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో ఎంఐఎం నేత‌లు ఆమెపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.. దీంతో మాధవీలత అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement