Tuesday, July 23, 2024

Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జ‌రిగింది. సెమ్రా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో భద్రతాదళాలు అక్కడికి వెళ్లి, స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్‌ నిర్వహించాయి.

ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement