Wednesday, May 15, 2024

కేసీఆర్ పాలనలో పల్లెలు ప్రగతి

సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు ప్రగతి పథంలో సాగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి మండలం చందుపట్ల మధిర గ్రామం కుమ్మరిగూడెంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి రూ. 5 లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్నా గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పాటు పడుతున్నామన్నారు. అనంతరం మండలంలోని తాజ్పూర్- అనంతరం గ్రామాలను సందర్శించి రోడ్డు పనులను ఎమ్మెల్యే పైళ్ల పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement