Saturday, April 27, 2024

ఛ‌త్తీస్‌ గ‌ఢ్‌ లో విషాదం.. వైద్యం వికటించి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి!

ఛ‌త్తీస్‌ గ‌ఢ్‌ లోని విషాదం నెల‌కొంది. బిలాస్‌ పూర్‌ లో వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన 7 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనారోగ్యం కార‌ణంగా ఒకే కుటుంబానికి చెందిన 12 మంది స్థానిక డాక్ట‌ర్ వ‌ద్ద వైద్యం కోసం వెళ్లారు. ఆ డాక్ట‌ర్ హోమియోప‌తి మెడిసిన్ డ్రోసెరా 30కి ఆ కుటుంబ స‌భ్యుల‌కు ఇంజెక్ష‌న్ రూపంలో ఇచ్చాడు. దీంతో 7 మంది ఒకేసారి చనిపోగా, మిగ‌తా ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతులు కమలేష్, అక్షయ్, రాజేష్, సమృధిగా గుర్తించారు. వైద్యం చేసిన డాక్ట‌ర్ ప‌రారీలో ఉన్నాడు. అత‌ని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement