Saturday, May 4, 2024

ఇంటింటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ : సీఎం బంప‌ర్ ఆఫ‌ర్

పంజాబ్​లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 92 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఆమ్​ ఆద్మీ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌… మార్పులు చేప‌డుతోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేరుస్తూ వ‌స్తోంది. అయితా తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రజలకు బంపర్ ఆపర్ ఇచ్చారు. ఇంటింటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందించనున్నట్లు తాజాగా ప్రకటించింది. జులై 1 నుంచి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం కల్లా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్​ 16న శుభవార్త వింటారని సీఎం భగవంత్​ మాన్​ గురువారం వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 200 యూనిట్ల కరెంట్​ ఉచితంగా ఇస్తుంది ఆప్​ ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement