Monday, April 29, 2024

108అడుగుల ఎత్త‌యిన ఆంజ‌నేయ విగ్ర‌హం – ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోడీ

గుజ‌రాత్ లోని మోర్బి జిల్లాలో 108అడుగుల ఎత్త‌యిన ఆంజ‌నేయ‌స్వామి విగ్ర‌హాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆవిష్క‌రించారు. నేడు హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది, కాగా వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని చెప్పారు. నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. మోర్బిలో 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా నాలుగు ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో ఇది రెండోది.

Advertisement

తాజా వార్తలు

Advertisement