Friday, March 29, 2024

షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మున్సిపాలిటీ, మేడ్చల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చే ప్రతిష్టాత్మ‌కంగా అమలు చేయబడుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపాలిటీకి 32 మందికి మండలంలో 48 మందికి 80 చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొరికికీ రూ.1,00,116 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, మేడ్చల్ ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయందర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కో అప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, దయానంద్ యాదవ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement