Saturday, April 27, 2024

1st ODI: కివీస్ టార్గెట్ 350 పరుగులు

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భార‌త్ VS న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు భారీ స్కోరు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్ శుభమాన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 350 పరుగులు చేయాల్సి ఉంది. శుభమాన్ గిల్ 149 బంతుల్లో 9 సిక్సర్లు, 19 ఫోర్లతో 208 పరుగులు పూర్తి చేశాడు. రోహిత్ శర్మ 34 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు, హార్ధిక్ పాండ్యా 28 పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement