Wednesday, May 8, 2024

Road Accident: రోడ్డుపై దూసుకొచ్చిన మృత్యువు.. 10 మంది భక్తులు దుర్మరణం

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కరీమ్గంజ్‌ జిల్లాలోని ఆటోను ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది మృతి చెందారు. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. చట్‌ పూజల్లో పాల్గొని తిరిగి స్వస్థలాలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. త్రిపుర సరిహద్దుల సమీపంలోని ఎనిమిదో నెంబర్‌ జాతీయ రహాదారి దగ్గర వేగంగగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement