Tuesday, May 7, 2024

ఆటోను ఢీ కొన్న ట్రక్కు..10మంది భ‌క్తులు మృతి..

అస్సాంలో… ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు మృతి చెందారు. కరీమ్గంజ్‌ జిల్లాలో ఆటోను ఓ ట్రక్కు ఢీ కొట్టింది. మృతి చెందిన వారిలో మహిళలు .. చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఛ‌ట్‌ పూజల్లో పాల్గొని తిరిగి స్వస్థలాలకు వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయ‌క చర్యలు చేపట్టారు. త్రిపుర సరిహద్దుల సమీపంలోని ఎనిమిదో నెంబర్‌ జాతీయ రహాదారి దగ్గర వేగంగగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement