Sunday, May 19, 2024

Srinagar: భారీ ఎన్‌కౌంటర్‌… ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఇవాళ‌ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నార‌న్న సమాచారం తెలుసుకున్న‌ భద్రతా దళాలు ఇవాళ ఉద‌యం వారి కోసం గాలింపు ప్రారంభించారు.

ఈ గాలింపులో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపి ముగ్గురిని మట్టుబెట్టారు. ప్రస్తుతం అక్కడ గాలింపు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement