ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ను ఆసీస్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో సొంతం చేసుకుంది. అయితే ఆసీస్ జట్టును కొవిడ్-19 వెంటాడుతోంది. ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రెవిస్ హెడ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
ట్రెవిస్ హెడ్ నాలుగో టెస్టుకు దూరమయ్యాడని సీఎ వెల్లడించింది. హెడ్కు వైద్యపరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్న హెడ్ యాషెస్ సిరీస్ చివరిటెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్లోని తొలి టెస్టును ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో హెడ్ కీలకపాత్ర పోషించాడు. హెడ్ నాలుగోటెస్టుకు దూరమవడంతో అతడి స్థానాన్ని రిజర్వ్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా భర్తీ చేయనున్నాడు. యాషెస్ సిరీస్లోని నాలుగో టెస్టు జనవరి 5న సిడ్నీ వేదికగా ప్రారంభం కానుండగా చివరిటెస్టు జనవరి 14నుంచి హోబర్ట్ వేదికగా జరగనుంది.