Thursday, May 9, 2024

ముగిసిన క్వారంటైన్..స్విమ్మింగ్ పూల్‌లో టీమిండియా ఆట‌గాళ్లు..

శ్రీలంకతో త్వ‌ర‌లోనే 3 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల కోసం టీమిండియా ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా ఆటగాళ్లు హోట‌ల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ పోస్ట్ చేసింది. జ‌ట్టు స‌భ్యులు అంద‌రూ క‌లిసి స్మిమ్మింగ్ పూల్‌లో చిరున‌వ్వులు చిందిస్తూ ఫొటోకు పోజు ఇచ్చారు. క్వారంటైన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో వారంతా ఎంజాయ్ చేస్తున్నార‌ని బీసీసీఐ తెలిపింది.  

ఇది కూడా చదవండి: రష్యాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. బూస్టర్ డోస్ మొదలెట్టిన ప్రభుత్వం..

Advertisement

తాజా వార్తలు

Advertisement