Monday, May 20, 2024

ADB: రోడ్ షో, బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సీతక్క

జైనూర్, మే 9 (ప్రభన్యూస్) : లోక్ స‌భ‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ రోడ్డు షో, బైక్ ర్యాలీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, నాయకులు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ లోక్ స‌భ‌ ఎన్నికల్లో ఉద్యమ నాయకురాలు, ఆదివాసి బిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని ప్రజల తరఫున పార్లమెంట్లో సమస్యలపై గళ్ళమెత్తుతుందన్నారు.

సుగుణ ఉపాధ్యాయురాలుగా పనిచేసినప్పుడు ఆమెపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టిందని, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిందని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ముఖిద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయూబ్ ఖాన్, రసీదు, కోప్షన్ సభ్యులు అప్రోజ్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ చైర్మన్ కుడుమత విశ్వనాథ్, నాయకులు సుద్దాల శ్రీనివాస్ దుక్రే సుభాష్, కోటేష్, రహీం, అబ్బు, హైమద్, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement