Monday, May 20, 2024

Congress Campaign – కుల గ‌ణ‌న చేస్తాం… ప్ర‌తి మ‌హిళ‌కు లక్ష ఇస్తాం – రాహుల్ గాంధీ

న‌ర్సాపూర్ – తాము దేశంలోని పేదలందరి జాబితాను తయారు చేస్తామని… ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను ఎంచుకొని… ఆ మహిళకు ఏడాదికి రూ.1 లక్ష జమ చేస్తామన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అంటే నెలకు రూ.8500 వస్తాయన్నారు. దీంతో పేదల జీవితాలు మారిపోతాయని పేర్కొన్నారు. ఈ పథకంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ జంప్ అవుతుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ ఈ పదేళ్లలో ఎంత అయితే కోటీశ్వరులకు ఇచ్చారో తాము అంతేమొత్తాన్ని పేదలకు పంచుతామని తెలిపారు.

నర్సాపూర్‌లో నేడు జ‌రిగిన ఎన్నిక‌ల ప్రచారంలో ఆయ‌న మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో కులగణన చేస్తుందని హామీ ఇచ్చారు. వివిధ వర్గాలు ఎంతనో తేలితే అప్పుడు అసలైన రాజకీయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయన్నారు. స్వాతంత్ర్యం, రాజ్యాంగం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, బయటపారేస్తామని అంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి ముందు దేశంలో పేదలకు ఎలాంటి హక్కులు లేకుండా ఉండేదన్నారు. దేశంలో వెనుకబడిన వర్గాలు, దళితుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

రెండు సిద్ధాంతాల మధ్య ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షిస్తుందని… మరెవరినీ రాజ్యాంగాన్ని రద్దు చేయనీయదని హామీ ఇచ్చారు. మీకు దక్కిన హక్కు రాజ్యాంగం వల్ల వచ్చిందనని సభకు వచ్చినవారిని ఉద్దేశించి అన్నారు. విద్య, ఉద్యోగాలు, ఓటు హక్కు అన్నీ రాజ్యాంగం ద్వారా వచ్చినవే అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థను పెంచి పోషిస్తున్నారన్నారు. రిజర్వేషన్లను తొలగించేందుకు మోదీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కేవలం 2 శాతం ఉన్న వాళ్ల చేతిలో సంపద ఉందన్నారు. ప్రధాని మోదీ దేశంలోని విమానాశ్రయాలను, పోర్టులను అదానీపరం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటే మేం 50 శాతానికి పైగా పెంచుతామని చెబుతున్నామన్నారు. తన పదేళ్ల కాలంలో మోదీ 25 మందిని ట్రిలియనీర్లుగా తయారు చేశారన్నారు.

అదానీ కోసమే దేశంలో పెద్ద నోట్లను నరేంద్ర మోడీ రద్దు చేశారంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. .. దేశంలో బడుగు బలహీనవర్గాలు, పేదలందరికీ భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని తెలిపారు. రాజ్యాంగం ఏర్పాటు కాకముందే పేదలు, అట్టడుగువర్గాల వారికి హక్కు ఉండేవి కాదని, వారందరికీ రాజ్యాంగమే హక్కులను కల్పించిందని అన్నారు. వాళ్లందరికీ అన్యాయం చేస్తూ.. నేడు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటోందని ప్రజలకు వివరించారు.

మోడీ పాలనలో ఆయన కొందరికే ప్రయోజనాలు అందించాలని చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు నిర్మూలించేంకే బీజేపీ ప్రైవేటికరణకు ఆజ్యం పోస్తోందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా దళితులు, ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

దేశ వ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆగస్ట్ 15 నాటికి ఉద్యోగల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. నరేంద్ర మోదీ పాలనలో అదానీ, అబానీలకు మాత్రమే లాభం జరిగిందని ధ్వజమెత్తారు. అదానీ కోసమే నోట్ల రద్దు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటీశ్వరులకు రుణ మాఫీ చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా జూన్ 4న కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మోదీ దేశంలోని యువతను నిరుద్యోగులుగా మార్చారని ఆరోపించారు. అదానీ కోసం పెద్ద నోట్ల రద్దు చేశారన్నారు. నరేంద్ర మోదీ రైతులను వేధించారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే మొదట చేసే పని రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చారు. తెలంగాణలో పంద్రాగస్ట్‌లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ మీ కోసం ప్రభుత్వం పని చేస్తోందని… ఢిల్లీలో తాను సైనికుడిలా పని చేస్తానన్నారు. ద్వేషపు బజారులో ప్రేమ దుకాణాన్ని తెరవడానికే తాము వచ్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement