Saturday, April 27, 2024

టీమిండియా ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్..

న్యూజిలాండ్‌తో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. కివీస్‌తో చారిత్రక టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఈనెల 18న ఆరంభంకానుంది. నెట్‌ సెషన్స్‌ తర్వాత ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇంగ్లాండ్‌ పరిస్థితులకు అలవాటు పడేందుకు బౌలర్లు వైవిధ్యంగా బంతులేస్తుండగా, బ్యాట్స్‌మెన్‌ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నారు.

ఏజీస్‌ బౌల్‌ స్టేడియానికి పక్కనున్న గ్రౌండ్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ బౌలింగ్‌ చేయగా పుజారా, శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌ చేశారు. మిగతా ఆటగాళ్లు ఫీల్డింగ్‌ చేశారు. కెప్టెన్‌ కోహ్లీ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను పర్యవేక్షించాడు. మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement