Saturday, April 27, 2024

Srivalli : సెమీస్ లో శ్రీవ‌ల్లి..

ఇందోర్‌: ఐటీఎఫ్‌ మహిళల టెన్నిస్‌ టూర్‌ టోర్నీలో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక భమిడిపాటి అదరగొట్టింది. సింగిల్స్‌ సెమీఫైనల్‌తో డబుల్స్‌ ఫైనల్లో శ్రీవల్లి దూసుకెళ్లింది. గ‌త సాయంత్రం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక 6-0, 6-0 తేడాతో ప్రపంచ 5వ ర్యాంకర్‌ జస్టీనా మికుల్స్‌కిటె (లిటౌనియా)పై సంచలన విజయం సాధించింది.

మొదిటి నుంచే చెలరేగి ఆడిన రష్మిక తనకంటే ఎంతో మెరుగైన రార్యకర్‌కు చెమటలు పట్టించి ఏకపక్షంగా మ్యాచ్‌ను కైవసం చేసుకుని సెమీస్‌లో ప్రవేశించింది. మరోవైపు మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో శ్రీవల్లి రష్మిక-వైదేహి చౌదరి జంట 6-1, 7-6 (8-6) తేడాతో భారత్‌కే చెందిన సహజ యమలపల్లి-జీల్‌ దేశాయ్‌ జోడిని ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement