Wednesday, May 22, 2024

Breaking: ఈజీ విన్‌.. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో భార‌త్ గెలుపు.. వికెట్ పోకుండా ఆడిన ఓపెన‌ర్స్‌!

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఇవ్వాల జ‌రిగిన ఫ‌స్ట్ మ్యాచ్‌లో ఇండియా భారీ గెలుపు న‌మోదు చేసుకుంది. తొలుత ఇంగ్లండ్ వెన్నువిరిచిన భార‌త బౌల‌ర్లు వారిని అస్స‌లు కోలుకోకుండా చేశారు. 50 ఓవ‌ర్ల మ్యాచ్‌ని 25 ఓవ‌ర్ల‌లోనే ఆలౌట్ చేసి అంద‌రినీ పెవిలియ‌న్‌కు పంపారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా 6 వికెట్లు తీసుకుని టాప్ క్లాస్ ప్లేయ‌ర్ అనిపించుకున్నాడు.

ఇండియ‌న్ ప్లేయ‌ర్ల ధాటికి త‌ట్టుకోలే ఇంగ్లండ్ 110 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇక సెకండ్ ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భార‌త టీమ్‌.. 18 ఓవ‌ర్ల‌లోనే ఆట‌ను ముగించింది. అయితే.. ఈ 110 ప‌రుగుల టార్గెట్‌ని ఈజీగా తీసుకున్న ఓపెన‌ర్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, మ‌రో ఓపెనర్ శిఖ‌ర్ ధ‌వ‌న్ క‌లిసి కుమ్మేశారు. ఈ క్ర‌మంలో రోహిత్ 58 బంతుల్లో 76 ప‌రుగులు, శిఖ‌ర్ ధ‌వ‌న్ 54 బంతుల్లో 31 ప‌రుగులు చేసి ఇండియాని విజ‌య‌తీరాల‌కు చేర్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement